దేశంలో బంగారం ధరలకు రెక్కలొచ్చినా దిగుమతుల్లో మాత్రం జోరు తగ్గలేదు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బంగారం దిగుమతులు 35.5 శాతం పెరిగినట్లు వాణిజ్యశాఖ అధికారిక గణాంకాలు వెల్లడించాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో బంగారం దిగుమతుల విలువ రూ. 59వేల కోట్లు ఉండగా.. ఈ ఏడాది రూ.80వేల కోట్లకు చేరింది.
35.5 శాతం పెరిగిన బంగారం దిగుమతులు - quarter
ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి దేశంలో పసిడి దిగుమతులు జోరందుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 35.5 శాతం బంగారం దిగుమతులు వృద్ధి చెందాయి.
![35.5 శాతం పెరిగిన బంగారం దిగుమతులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4119332-1085-4119332-1565648657127.jpg)
35.5శాతం పెరిగిన బంగారం దిగుమతులు
అంతర్జాతీయ మార్కెట్ నుంచి ఏటా 800-900 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటోంది భారత్. ఈ ఏడాది దిగుమతుల్లో ఫిబ్రవరి మినహా ప్రతినెలా రెండంకెల వృద్ధిని నమోదు చేసింది.
Last Updated : Sep 26, 2019, 8:07 PM IST