తెలంగాణ

telangana

By

Published : May 24, 2021, 4:08 PM IST

ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

పసిడి, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. పది గ్రాముల మేలిమి పుత్తడి ధర సోమవారం దాదాపు రూ.100 పెరిగింది. వెండి ధర కిలో రూ.71 వేలకు చేరువైంది.

Gold And Silver price Today
బంగారం ధరలు

బంగారం, వెండి ధరలు సోమవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.95 పెరిగి.. రూ.48,015 వద్దకు చేరింది. డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం పసిడి ధర పెరుగుదలకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

పసిడి బాటలోనే వెండి ధర కూడా రూ.154 (కిలోకు) పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.70,998 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,882 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 27.67 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చదవండి:పసిడి బాండ్ల ఇష్యూ షురూ- గ్రాముకు ఎంత?

ABOUT THE AUTHOR

...view details