తెలంగాణ

telangana

By

Published : Jan 20, 2021, 5:13 PM IST

ETV Bharat / business

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు బుధవారం భారీగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దిల్లీలో దాదాపు రూ.350 ఎగిసింది. వెండి ధర కిలో రూ.66 వేలకు చేరువైంది.

today gold price
నేటి బంగారం ధర

బంగారం ధర బుధవారం భారీగా రూ.347 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.48,758 వద్దకు చేరింది.

అంతర్జాతీయంగా పసిడి డిమాండ్​కు తగ్గట్లు దేశీయంగానూ బంగారం ధరలు పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

పసిడి బాటలోనే వెండి ధర కూడా కిలోకు (దిల్లీలో) రూ.606 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.65,814 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,854 డాలర్లకు పెరిగింది. వెండి ధర 25.28 డాలర్లకు ఎగిసింది.

ఇదీ చూడండి:ఎయిర్​టెల్ పేమెంట్స్​ బ్యాంక్​లో నయా ఫీచర్

ABOUT THE AUTHOR

...view details