తెలంగాణ

telangana

By

Published : Jan 5, 2021, 4:17 PM IST

ETV Bharat / business

మరింత పెరిగిన బంగారం, వెండి ధరలు

పసిడి, వెండి ధరలు మంగళవారం కూడా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.51 వేలకు చేరువైంది. వెండి ధర కిలోకు ఏకంగా రూ.69.5 వేలు దాటింది.

Gold and Silver Price today
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధర

బంగారం ధర మంగళవారం కాస్త పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.335 ఎగిసి.. రూ.50,969 వద్దకు చేరింది.

డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం పసిడి ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు.

పసిడి బాటలోనే వెండి ధర కిలోకు(దిల్లీలో) భారీగా రూ.382 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.69,311 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,942 డాలర్ల వద్ద, వెండి ఔన్సుకు 27.30 డాలర్ల వద్ద దాదాపు ఫ్లాట్​గా ఉన్నాయి.

ఇదీ చూడండి:టీకా జోష్​- మార్కెట్ల ఆల్​టైమ్​ రికార్డ్​

ABOUT THE AUTHOR

...view details