తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.48వేలు దాటిన 10 గ్రాముల పసిడి ధర

బంగారం ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. మేలిమి 10 గ్రాముల పసిడి ధర రూ. 153 పెరిగి.. రూ. 48,000 దాటింది. అయితే వెండి ధర మాత్రం తగ్గింది.

By

Published : Jun 12, 2020, 6:35 PM IST

Gold gains Rs 153 on global cues
బంగారం భగ భగ.. రూ.48వేలు దాటిన 10 గ్రాముల ధర

అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.153 పెరిగి రూ. 48,144 కు చేరింది.

అయితే వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. కిలో వెండిపై రూ.665 తగ్గి.. రూ. 49,235 కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో బంగారం రేటు ఔన్సుకు 1,734 యూఎస్​ డాలర్లుగా ట్రేడవుతుండగా.. వెండి ధర రూ. 17.62 యూఎస్​ డాలర్లుగా ఉంది.

ఇదీ చదవండి:ఆరంభం భయపెట్టినా.. చివరకు అనూహ్య లాభాలు

ABOUT THE AUTHOR

...view details