తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Price Today:పెరిగిన బంగారం, వెండి ధరలు - భారత్​లో బంగారం వెండి ధరలు

బంగారం, వెండి ధరలు బుధవారం కాస్త పెరిగాయి. పది గ్రాముల మేలిమి పుత్తడి(Gold rate in India) ధర దిల్లీలో రూ.46,400 వద్దకు చేరింది. కిలో వెండి (Silver rate in India) రూ.300కుపైగా పెరిగింది.

gold price today in India
నేటి బంగారం ధరలు

By

Published : Jun 23, 2021, 4:05 PM IST

బంగారం, వెండి ధరలు బుధవారం మరింత ప్రియమయ్యాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర (Gold price today) రూ.110 పెరిగి.. రూ.46,396 వద్దకు చేరింది. అంతర్జాతీయంగా ధరలు రికవరీ అవుతుండటం వల్ల దేశీయంగానూ పసిడి ధరలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

పసిడి బాటలోనే వెండి ధర (Silver price today) కూడా రూ.324 (కిలోకు) పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.66,864 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,783 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 25.94 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చదవండి:'వృద్ధిరేటు 9.6 శాతానికే పరిమితం!'

ABOUT THE AUTHOR

...view details