తెలంగాణ

telangana

By

Published : Feb 11, 2021, 4:08 PM IST

ETV Bharat / business

కాస్త పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు కాస్త పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర గురువారం దిల్లీలో అతి స్వల్పంగా రూ.40 పెరిగింది. వెండి ధర కిలో మళ్లీ రూ.69 వేల పైకి చేరింది.

gold price raised
పెరిగిన బంగారం ధర

బంగారం ధర గురువారం అతిస్వల్పంగా రూ.36 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.47,509 వద్దకు చేరింది.

అంతర్జాతీయంగా పసిడి డిమాండ్​కు తగ్గట్లు దేశీయంగానూ బంగారం ధరలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర కూడా కిలోకు (దిల్లీలో) రూ.454 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.69,030 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,844 డాలర్లకు పెరిగింది. వెండి ధర 27.18 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చూడండి:తేరుకున్న మార్కెట్లు- సరికొత్త గరిష్ఠాలకు సూచీలు

ABOUT THE AUTHOR

...view details