ఇటీవల పెరుగుతూ వచ్చిన బంగారం ధర మళ్లీ స్వల్పంగా తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి బుధవారం రూ.26 తగ్గి.. రూ.51,372 వద్దకు చేరింది.
అంతర్జాతీయంగా పసిడి ధరలు తగ్గుతుండటం వల్ల ఆ ప్రభావం దేశీయంగా పడుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.