తెలంగాణ

telangana

ETV Bharat / business

తగ్గిన బంగారం ధర.. 10 గ్రాములు ఎంతంటే

పసిడి ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర నేడు రూ.157 క్షీణించింది. వెండి కిలోకు రూ.47,517 వద్దకు చేరింది.

By

Published : Mar 5, 2020, 4:37 PM IST

gold rate in India
తగ్గిన బంగారం ధర

బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర నేడు రూ.157 తగ్గి.. రూ. 44వేల 250కు చేరింది.

దేశీయంగా పసిడికి డిమాండు లేకపోవడమే ధరల తగ్గుదలకు కారణంగా నిపుణులు చెబుతున్నారు.

వెండి ధర కిలోకు రూ.99 (దిల్లీలో) తగ్గి.. రూ.47,517 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఔన్సు బంగారం ధర 1,640 డాలర్లు ఉండగా, వెండి ఔన్సుకు 17.17 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:ఈపీఎఫ్ చందాదారులకు షాక్.. డిపాజిట్లపై వడ్డీ రేటు తగ్గింపు

ABOUT THE AUTHOR

...view details