తెలంగాణ

telangana

ETV Bharat / business

మరింత తగ్గిన బంగారం ధర- పసిడి బాటలోనే వెండి - నేటి పసిడి ధరలు

బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర నేడు రూ.128 తగ్గింది. వెండి ధర కిలోకు రూ.46,868కి చేరింది.

GOLD RATE TODAY
నేటి బంగారం ధరలు

By

Published : Mar 12, 2020, 4:25 PM IST

బంగారం ధర మరింత తగ్గింది. నేటి లెక్కల ప్రకారం దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.128 తగ్గి.. రూ.44,490కి చేరింది.

అంతర్జాతీయంగా పుత్తడి ధరలు భారీగా క్షీణిస్తున్న నేపథ్యంలో ఆ ప్రభావం దేశీయంగా ఉంటోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

వెండి ధర కూడా నేడు కిలోకు (దిల్లీలో) రూ.302 తగ్గి.. రూ.46,868వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,645 డాలర్లకు తగ్గింది. వెండి ఔన్సుకు 16.73 డాలర్లుగా వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చూడండి:ఆరోగ్య బీమా పరిధిలోకి కరోనా చికిత్స- కేంద్రం నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details