తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం ధర - silver rates today

బంగారం ధర వరుసగా రెండో రోజు కూడా తగ్గింది. మరోవైపు వెండి స్వల్పంగా బలపడింది. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధరపై రూ.139 తగ్గింది. వెండి ధర కిలోకు రూ.62,648కి చేరింది.

Gold declines Rs 137 amid tepid demand in indian markets
తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు

By

Published : Oct 27, 2020, 5:36 PM IST

దేశీయ మార్కెట్​లో బంగారం ధర మంగళవారం స్వల్పంగా తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.137 దిగొచ్చి.. రూ.51,245 కు చేరింది.

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో నెలకొన్న ఒత్తిడి కారణంగా పసిడి ధరలు తగ్గుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర కిలోకు రూ.475 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.62,648 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,903.6 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు 24.48 డాలర్ల వద్ద స్థిరపడింది

అమెరికా డాలర్​తో పోల్చితే.. రూపాయి విలువ 13 పైసలు బలపడి రూ.73.71 వద్ద నిలిచింది.

ఇదీ చూడండి: ఫ్యూచర్ రిటైల్ ​కోసం రిలయన్స్-అమెజాన్ రణం

ABOUT THE AUTHOR

...view details