బంగారం ధర చుక్కలనంటుతోంది. బుధవారం రూ. 300 పెరిగి 39, 970గా నమోదైన పసిడి... నేడు మరో రూ. 250 పెరిగి తొలిసారిగా రికార్డు స్థాయిలో 40వేల మార్కు దాటింది. పుత్తడి ధర రూ. 40,220 వద్ద ముగిసిందని అఖిల భారత సరాఫా అసోసియేషన్ ప్రకటించింది.
పరిశ్రమ వర్గాలు, నాణేల తయారీ యూనిట్ల నుంచి వస్తోన్న డిమాండ్తో కిలో వెండి ధర రూ. 200 పెరిగి...రూ. 49050 వద్ద ముగిసింది.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్య భయాలు, అమెరికా-చైనా వాణిజ్య చర్చలపై అనిశ్చితుల నేపథ్యంలో మదుపరులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. పండుగలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పసిడి ధర ఆకాశాన్ని అంటుతోంది. రూపాయి విలువ బలహీనపడటం బంగారం ధర పెరగడానికి కారణంగా తెలుస్తోంది.