తెలంగాణ

telangana

కార్పొరేట్లకు సహకరిస్తేనే వృద్ధి గాడిలో పడుతుంది : సుబ్రమణియన్

By

Published : Feb 4, 2020, 6:54 PM IST

Updated : Feb 29, 2020, 4:19 AM IST

ఆర్థిక మందగమనం నుంచి కోలుకోవాలంటే.. కార్పొరేట్లకు ఉపశమనం కల్పించాల్సిందేనని కేంద్రప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు. అప్పుడే ప్రైవేటు పెట్టుబడులు పెరిగి దేశ వృద్ధి గాడిలో పడుతుందని విశ్లేషించారు.

giving-relief-to-corporates-is-key-for-revival-of-economy-chief-economic-advisor
కార్పొరేట్లకు సహకరిస్తేనే వృద్ధి గాడిలో పడుతుంది : సుబ్రమణియన్

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ తాజా బడ్జెట్​లో కార్పొరేట్ రంగానికి ఇచ్చిన ఉపశమనాన్ని... ప్రముఖ ఆర్థికవేత్త, ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ గట్టిగా సమర్థించారు. ప్రైవేటు పెట్టుబడులు పెరిగి, వృద్ధి గాడిలో పడడానికి ఇది ఎంతో సహకరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

కార్పొరేట్లకు సహకరిస్తేనే వృద్ధి గాడిలో పడుతుంది : సుబ్రహ్మణియన్

డీడీటీ రద్దు మంచిదే...

సార్వభౌమ సంపద నిధులను, పెన్షన్​ ఫండ్లను భారత్​లో పెట్టుబడులుగా పెట్టకుండా 'డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్​ టాక్స్'​ (డీడీటీ) లాంటి పన్నులు నిరుత్సాహపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డీడీటీ లాంటి పన్నులు రద్దు చేయడం ఆహ్వానించదగిన పరిణామమని కృష్ణమూర్తి అన్నారు. దీని వల్ల దేశ పన్నుల వ్యవస్థలో ఉన్న లోపాలు కొంతమేర సరిదిద్దడానికి వీలైందని పేర్కొన్నారు.

భారం ప్రజలపైనే

"కార్పొరేట్ల నుంచి డీడీటీ వసూలు చేయడంవల్ల, ఈ సంస్థలపై వాస్తవానికి పన్ను విధించనప్పటికీ పన్నులు చెల్లించాల్సి వచ్చింది. డీడీటీ వసూలు చేయడం ద్వారా... కార్పొరేట్ల మీద భారం పడదు. పెట్టుబడిదారులపై పడుతుంది. పెన్షన్​ ఫండ్స్, బీమా సంస్థలు, సావరిన్ వెల్త్ ఫండ్స్ నిజానికి వీటిలోని నిజమైన పెట్టుబడిదారులు సామాన్య ప్రజలే కానీ కార్పొరేట్లు కాదు" అని కృష్ణముూర్తి తెలిపారు.

కార్పొరేట్లకు బూస్ట్​

తాజాగా బడ్జెట్​లో నిర్మలా సీతారామన్ డీడీటీ నుంచి కార్పొరేట్లకు ఉపశమనం కల్పించారు. గత ఆరునెలల్లో కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన రెండో ఊరట ఇది.

2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5 శాతానికి తగ్గింది. దీనితో పెట్టుబడులను పెంచడానికి, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడానికి గతేడాది సెప్టెంబర్​లో సీతారామన్​ కార్పొరేట్ పన్నును భారీగా తగ్గించారు.

ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాలి

గతవారం సమర్పించిన ఆర్థిక సర్వేలోనూ... ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని కృష్ణమూర్తి నొక్కిచెప్పారు. పెట్టుబడులు పెరగడానికి జీడీపీ వృద్ధిరేటు పెరగడానికి మధ్య సంబంధాన్ని ఆయన సోదాహరణంగా వివరించారు.

ఇదీ చూడండి: జీఎస్టీ లాటరీ.. రూ. కోటి వరకు గెలుచుకునే అవకాశం!

Last Updated : Feb 29, 2020, 4:19 AM IST

ABOUT THE AUTHOR

...view details