దేశాన్ని ఆర్థికమందగమనం నుంచి గట్టెక్కించేందుకు ఉద్దీపన చర్యలు చేపడుతున్నామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనలకు, వాస్తవాలకు చాలా అంతరం ఉంది.2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ వృద్ధి) 5 శాతంగా ఉంటుందని కేంద్ర గణాంకాల సంస్థ (సీఎస్ఓ) ముందస్తు అంచనాలు చెబుతున్నాయి. అంటే ఇదివరకు ఆర్థిక మంత్రిత్వశాఖ అంచనా వేసిన 7 శాతం వృద్ధిరేటును సీఎస్ఓ 5 శాతానికే పరిమితం చేసింది. గత పది త్రైమాసికాలుగా దేశ వృద్ధి క్షీణిస్తుండడమే ఇందుకు కారణమని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
మాటలకు... చేతలకు అదే తేడా!
ఆర్థికవ్యవస్థను మందగమనం నుంచి గట్టెక్కిస్తామంటూ ఆర్థికమంత్రి మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పలు ఉద్దీపనలు ప్రకటించారు. అయితే ప్రభుత్వ మూలధన ఆస్తుల నిర్మాణం ఏమాత్రం జరగలేదు. అలాగే సీతమ్మ బడ్జెట్ అంచనాలను... గతేడాది సవరించిన వాటితో పోల్చి చూసినప్పడు ప్రభుత్వ పెట్టుబడులు ఏ మాత్రం పెరగలేదని స్పష్టంగా అర్థమవుతుంది. దీని ప్రకారం తేలింది ఏమిటంటే.. ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనానికి పక్కా ప్రణాళికలకు బదులు అందమైన బడ్జెట్ ప్రసంగంతో సరిపెట్టిందని.
వృద్ధికి చర్యలేవీ?
సీఎస్ఓ అంచనా ప్రకారం ఆర్థిక సంక్షోభంతో.. 2020 అర్ధ వార్షికానికి ప్రభుత్వ మూలధన ఆస్తుల నిర్మాణం 0.54 శాతానికి తగ్గనుంది. ఆర్థికవ్యవస్థ పుంజుకునేలా చేసేందుకు కేంద్రం చేపట్టిన స్వల్పకాలిక పునరుజ్జీవన సంస్కరణల వ్యూహం విఫలమైంది. అయితే ఆర్థికవేత్తలు సూచిస్తున్నట్లుగా స్వల్పకాలికంగా డిమాండ్ పెంచడానికి కొన్ని చర్యలు తీసుకోకతప్పదు. మంచి పరిపాలనా విభాగం, ఆర్థిక సంస్కరణలు చేపడితేనే క్రమంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వ పెట్టుబడులేవి?
స్వదేశీ, విదేశీ ఆర్థిక నిపుణులు... ఈ ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధిరేటు 0.25 శాతం అటుఇటుగా 5 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆర్థికమంత్రి తన బడ్జెట్లో చాలా పెద్ద వాగ్దానాలు చేశారు. కానీ వాస్తవానికి ప్రభుత్వ పెట్టుబడులు పెరగడం పక్కనపెడితే.. అంతకంతకూ తగ్గిపోతున్నాయి. ఫలితంగా వృద్ధిరేటు కూడా బాగా క్షీణిస్తోంది.
జేఎన్యూ ఎకనామిస్ట్
జేఎన్యూలో శిక్షణ పొందిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన మేధస్సు అంతా ఉపయోగించి బడ్జెట్ రూపొందించారు. పెట్టుబడులను ప్రొత్సహించేలా ప్యాకేజీలు అందిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఇప్పటి వరకు రెండు సార్లు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించారు.
హౌసింగ్, టాక్స్ అడ్మినిస్ట్రేషన్ వంటి వాటిలో దీర్ఘకాలిక విధాన మార్పులకు తీసుకొస్తామన్నారు సీతారామన్. అయితే స్థూల ఆర్థిక ఉద్దీపనలు మాత్రం తగ్గించారు. వాస్తవానికి మహిళా స్వయం సహాయక బృందాలకు చెందిన రిజర్వులకు మద్దతుగా మాత్రమే వ్యయం పెరిగింది. పీఎస్యూలకు, ఇతర సంస్థలకు కావాల్సిన పెట్టుబడులు మాత్రం తగ్గాయి.
పీఎస్యూలు ఎందుకు పెట్టుబడి పెట్టాలి?