తెలంగాణ

telangana

ETV Bharat / business

మళ్లీ పెట్రో బాదుడు- లీటరు రూ.100! - మళ్లీ పెట్రో బాదుడు- లీటరు రూ.100!

పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర 25 పైసలు పెరిగి.. రూ.92.11 వద్దకు చేరింది. డీజిల్​ ధర సైతం 25 పైసలు పెరిగింది. తాజా బాదుడుతో భోపాల్​లో పెట్రోల్ ధర వంద రూపాయలు దాటింది.

PETROL
మళ్లీ పెట్రో బాదుడు- లీటరు రూ.100!

By

Published : May 12, 2021, 11:04 AM IST

దేశంలో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్ ధర 25 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఫలితంగా పెట్రోల్ ధర రూ.92.11కి పెరిగింది. మరోవైపు, దిల్లీలో లీటరు డీజిల్ ధర సైతం 25 పైసలు పెరిగి.. రూ.82.67కి చేరుకుంది.

తాజా పెంపుతో భోపాల్​లో పెట్రోల్ వంద రూపాయలు దాటింది. ప్రస్తుతం రూ.100.08 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.90.05కి పెరిగింది.

ముంబయిలో లీటరు పెట్రోల్ ధర రూ.98.36గా ఉండగా.. డీజిల్ ధర రూ.89.75కి చేరింది.

ABOUT THE AUTHOR

...view details