దేశీయ దిగ్గజ సంస్థలు టాటా, ఆదానీ, మహీంద్రా, భారత్ ఫోర్జ్ ... భారత నావికాదళానికి 111 స్వదేశీ తయారీ హెలికాప్టర్లను అందించే రూ.25 వేల కోట్ల విలువైన ప్రాజెక్టును చేజిక్కించుకునేందుకు పోటీపడుతున్నాయి.
దేశీయ పరిశ్రమల రక్షణ ఉత్పాదక సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి... నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యూహాత్మక భాగస్వామ్య విధానాన్ని అనుసరిస్తూ చేపట్టిన మొదటి ప్రాజెక్టు ఇది. ఇందులో భాగంగా 111 హెలికాప్టర్లను భారతీయ, విదేశీ సంస్థల ఉమ్మడి భాగస్వామ్యంతో దేశీయంగా తయారు చేయాల్సి ఉంటుంది.
ప్రణాళిక ప్రకారం... మొదటి 16 హెలికాప్టర్లను ఓఈఎమ్ ద్వారా విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో సమకూర్చుకోవాలి. మిగిలిన 95 హెలికాప్టర్లను భారత్లో ఎంచుకున్న వ్యూహాత్మక భాగస్వామితో కలిసి రూపొందించాల్సి ఉంటుంది.
8 కంపెనీలు పోటీ