తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్​బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్​ కన్నుమూత - గుండె పోటుతో కేసీ చక్రవర్తి మృతి

ఆర్​బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్​ కేసీ చక్రవర్తి శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 2009 జూన్​ నుంచి 2014 ఆగస్టు వరకు ఆర్​బీఐ డిప్యూటీ గవర్నర్​గా ఆయన సేవలందించారు.

K C Chakrabarty
కమలేశ్​ చంద్ర చక్రవర్తి

By

Published : Mar 26, 2021, 10:57 AM IST

భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్​బీఐ) మాజీ డిప్యూటీ గవర్నర్​ కమలేశ్​ చంద్ర చక్రవర్తి (69) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం గుండె పోటుతో ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

2009 జూన్​ నుంచి 2014 ఆగస్టు వరకు ఆర్​బీఐ డిప్యూటీ గవర్నర్​గా ఉన్నారు కేసీ చక్రవర్తి. పదవీ కాలం కన్నా మూడు నెలల ముదే ఆయన రాజీనామా చేశారు.

ఎకనామిక్​ ఇన్​క్లూజన్​, అక్షరాస్యత కోసం ఆయన చేసిన కృష్టికి గానూ భారత్​ సహా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది.

ఇరీ చదవండి:పోటాపోటీగా.. పెట్రో పీడన!

ABOUT THE AUTHOR

...view details