తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎర్రటి వస్త్రంలోనే బడ్జెట్​ ప్రతులు.. పార్లమెంట్​కు సీతమ్మ

బడ్జెట్​ ప్రతులను తీసుకొచ్చే సూట్​కేసు​ సంప్రదాయానికి క్రితంసారి స్వస్తి పలికిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. ఈ ఏడాది అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. ఎర్రటి వస్త్రంలో బడ్జెట్​ ప్రతులను తీసుకుని పార్లమెంట్​కు బయలుదేరారు.

By

Published : Feb 1, 2020, 9:40 AM IST

Updated : Feb 28, 2020, 6:08 PM IST

Finance Minister Nirmala Sitharaman
ఎర్రటి వస్త్రంలోనే బడ్జెట్​ ప్రతులు

ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నేడు 2020-21 వార్షిక బడ్జెట్​ ప్రవేశపెట్టనుంది. క్రితంసారి సూట్​కేసు సంప్రదాయానికి చెక్​ పెట్టి ఎర్రటి వస్త్రంలో బడ్జెట్​ ప్రతులను తీసుకొచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ఈసారి అదే సంప్రదాయాన్ని కొనసాగించారు.

ఎర్రటి వస్త్రంలోనే బడ్జెట్​ ప్రతులు

ఆర్థిక శాఖ కార్యాలయంలో ముందస్తు కసరత్తు చేపట్టిన నిర్మలా.. తమ బృందంతో ఎర్రటి వస్త్రంలో బడ్జెట్​ ప్రతులను పట్టుకుని రాష్ట్రపతిని కలిసేందుకు బయలుదేరారు. అక్కడి నుంచి పార్లమెంట్​కు రానున్నారు.

నేడు ఉదయం 11 గంటలకు పార్లమెంట్​లో వార్షిక ఆదాయ వ్యయ పద్దు ప్రవేశపెట్టనున్నారు నిర్మలా.

Last Updated : Feb 28, 2020, 6:08 PM IST

ABOUT THE AUTHOR

...view details