ఇప్పటికే కరోనా వైరస్ను ఎరగా చూపి, వ్యాపారం పెంచుకునేందుకు ఇచ్చే ప్రకటనలపై ఫిబ్రవరిలోనే నిషేధం విధించిన ఫేస్బుక్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్కు సంబంధించిన మాస్కుల ప్రకటనలను తాత్కాలికంగా నిషేధించనున్నట్లు వెల్లడించింది. వ్యాపార ప్రకటనల్లో కూడా మాస్కులకు సంబంధించిన సమాచారం ఉండకూడదని స్పష్టం చేసింది.
వాణిజ్య ప్రకటనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూనే, మరోవైపు వారిని ఆందోళనకు గురిచేసి, దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వ్యాపారులు. వీటిని నిరోధించే ప్రయత్నంలో భాగంగానే మాస్కుల ప్రకటనలపై నిషేధం విధించినట్లు అధికారులు తెలిపారు. ఈ నిషేధం కొన్నిరోజుల వరకు కొనసాగుతుందన్నారు.
"మా బృందాలు కొవిడ్-19 పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. మా విధానాలకు అనుగుణంగా వైరస్కు సంబంధించిన తాజా సమాచారం ఫేస్బుక్లో పొందుపరుస్తాం"