తెలంగాణ

telangana

ETV Bharat / business

500 కోట్ల​ డాలర్ల జరిమానా చెల్లింపునకు ఫేస్​బుక్​ రెడీ

అమెరికా ఫెడరల్​ ట్రేడ్​ కమిషన్​(ఎఫ్​టీసీ) విధించిన.. 500 కోట్ల డాలర్ల జరిమానా చెల్లించేందుకు అంగీకరించింది సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​. గోప్యత నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఫేస్​బుక్​పై చర్య తీసుకుంది ఎఫ్​టీసీ.

By

Published : Jul 25, 2019, 11:19 AM IST

500 కోట్ల​ డాలర్ల జరిమానా చెల్లింపునకు ఫేస్​బుక్​ రెడీ

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​ 500 కోట్ల డాలర్ల జరిమానా చెల్లించేందుకు అంగీకరించింది. వినియోగదారుల సమాచారంపై గోప్యత పాటించని కారణంగా అమెరికా ఫెడరల్​ ట్రేడ్​ కమిషన్​(ఎఫ్ టీసీ).. ఫేస్​బుక్​పై ఇంత మొత్తం పెనాల్టీ విధించింది.

జరిమానాకు తోడు... యూజర్ల గోప్యతకు కంపెనీ జవాబుదారీగా ఉండేలా నూతన నిబంధనలు రూపొందించి ట్రేడ్​ కమిషన్​కు సమర్పిస్తామని తెలిపింది ఫేస్​బుక్​.

నిబంధనల ఉల్లంఘన..

వ్యక్తిగత సమాచారం, గోప్యత నియంత్రణ పాటించకుండా 2012 ఎఫ్​టీసీ ఉత్తర్వులను ఉల్లంఘించిందన్న ఫెడరల్​ ట్రేడ్​ కమిషన్​ చర్యలకు బదులుగా ఫేస్​బుక్​ ఇవన్నీ అంగీకరించింది.

వినియోగదారుల గోప్యత నిబంధనలు పాటించని కంపెనీలపై విధించే అత్యధిక జరిమానా ఇదే కాగా.. ఎఫ్​టీసీ చరిత్రలో కూడా ఇదే అతిపెద్ద జరిమానా కావడం గమనార్హం.

వినియోగదారుల సమాచారాన్ని తప్పుదోవ పట్టించినందుకు కేంబ్రిడ్జ్‌ అనలిటికా కేసులో విధించిన 10 కోట్ల డాలర్ల జరిమానాను కూడా చెల్లించనున్నట్లు ఫేస్‌బుక్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

సగటున 210 కోట్ల మంది ప్రజలు ప్రతిరోజూ ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​, వాట్సాప్​ లేదా మెసెంజర్​ వినియోగిస్తున్నారని అంచనా. 270 కోట్ల మందికి పైగా ప్రతి నెలా వీటన్నింటిలో ఏదో ఒకటి వాడుతున్నారట. అందుకే.. వినియోగదారులకు మెరుగైన సేవల కోసం.. సమాచార భద్రత ప్రమాణాలు పక్కాగా పాటిస్తామని పేర్కొందీ సోషల్​ మీడియా దిగ్గజ సంస్థ.

ABOUT THE AUTHOR

...view details