తెలంగాణ

telangana

By

Published : Aug 21, 2020, 4:27 PM IST

ETV Bharat / business

నిబంధనలు సడలింపు- నిరుద్యోగ కార్మికులకు వరాలు!

కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన కార్మికులకు ప్రయోజనం కలిగేలా ఈఎస్​ఐసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. నిరుద్యోగ భృతి పొందేందుకు కావాల్సిన అర్హత ప్రమాణాలను సడలించింది. ఇదివరకు మూడు నెలల సగటు వేతనంలో 25 శాతం భృతి చెల్లిస్తుండగా... ప్రస్తుతం ఈ పరిమితిని 50 శాతానికి పెంచింది. ఇదివరకు.. ఉద్యోగం కోల్పోయిన 90 రోజుల తర్వాత భృతి అందజేస్తుండగా.. దాన్ని 30 రోజులకు తగ్గించింది.

ESIC relaxes norms, to pay 50 pc of three months' wages to unemployed workers
నిబంధనలు సడలింపు- నిరుద్యోగ కార్మికులకు వరాలు!

కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులకు ప్రయోజనం కలిగే విధంగా ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్​ఐసీ) నిర్ణయం తీసుకుంది. మార్చి 24 నుంచి డిసెంబర్ 31 వరకు ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులకు మూడు నెలల సగటు వేతనాలలో 50 శాతం చెల్లించేందుకు నిబంధనలు సడలించింది. ఈ నిర్ణయం వల్ల 40 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం కలగనుంది.

మరోవైపు, 'అటల్ బిమిత్ వ్యక్తి కల్యాణ్ యోజన' పథకం కింద ప్రయోజనాలు పొందేందుకు కావాల్సిన అర్హతలను సడలించింది. నిరుద్యోగ భృతిని పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జూన్ 31వరకు పథకం అందుబాటులో ఉంటుందని ఈఎస్​ఐసీ స్పష్టం చేసింది. 2021 జనవరి 1నుంచి ఇదివరకటి నిబంధనలతో కొనసాగుతుందని వెల్లడించింది. నిబంధనల సడలింపుపై పరిస్థితులను బట్టి డిసెంబర్ 31 తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది.

30 రోజులకే..

భృతి పొందేందుకు కావాల్సిన అర్హత ప్రమాణాలను సడలించింది ఈఎస్​ఐసీ. ఉద్యోగం కోల్పోయిన కార్మికులకు ఇదివరకు మూడు నెలల సగటు వేతనంలో 25 శాతం చెల్లిస్తుండగా... ప్రస్తుతం ఈ పరిమితిని 50 శాతానికి పెంచింది. ఇదివరకు.. ఉద్యోగం కోల్పోయిన 90 రోజుల తర్వాత భృతి అందజేస్తుండగా.. దాన్ని 30 రోజులకు తగ్గించింది.

నేరుగా ఖాతాల్లోకే

బీమా కలిగిఉన్న వ్యక్తులు నేరుగా ఈఎస్​ఐసీ బ్రాంచ్ కార్యాలయంలో తమ క్లెయిమ్​ను సమర్పించాలని, నగదును నేరుగా వారి ఖాతాల్లోకే బదిలీ చేస్తామని ఈఎస్​ఐసీ తెలిపింది. క్లెయిమ్ చేసుకునే వారికి కనీసం రెండు సంవత్సరాల పాటు ఉద్యోగ బీమా కలిగి ఉండాలని పేర్కొంది. ఉద్యోగం కోల్పోయిన తర్వాత కాంట్రిబ్యూషన్ పీరియడ్​లో కనీసం 78 రోజులు, మిగిలిన మూడు కాంట్రిబ్యూషన్ పీరియడ్స్​లలో కలిపి 78 రోజులు పనిచేసి ఉండాలని తెలిపింది.

కొవిడ్ ప్రభావానికి గురైన కార్మికులను ఆదుకునేందుకు ఈఎస్​ఐసీ మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపింది. ఈఎస్​ఐసీ ఆస్పత్రులలోని 10 శాతం పడకలను ఐసీయూలుగా మార్చాలని నిర్ణయించింది.

ఇదీ చదవండి-విద్యుత్​ షేర్ల దూకుడు​- వారాంతంలోనూ లాభాలే

ABOUT THE AUTHOR

...view details