తెలంగాణ

telangana

ETV Bharat / business

4 నెలల్లో రూ.30 వేల కోట్ల పీఎఫ్​ సొమ్ము విత్​డ్రా

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్​) నుంచి నగదు ఉపసంహరణలు భారీగా పెరిగాయి. ఏప్రిల్-జూన్ మధ్య 4 నెలల్లో 80 లక్షల మంది ఉద్యోగులు రూ.30 వేల కోట్లు విత్​డ్రా చేసుకున్నట్లు ఈపీఎఫ్​ఓ ప్రకటించింది.

By

Published : Jul 28, 2020, 2:56 PM IST

epf withdraws
ఈపీఎఫ్ విత్​డ్రాలు

కరోనా కారణంగా అందరి ఆదాయాలపై తీవ్రంగా ప్రభావం పడింది. ఇలాంటి పరిస్థితుల్లో వేతన జీవులు.. ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకు ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్​) నుంచి భారీగా నగదు ఉపసంహరించుకుంటున్నారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్​ఓ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్-జులై మధ్య 80 లక్షల మంది ఉద్యోగులు రూ.30 వేల కోట్ల నగదు విత్​డ్రా చేసుకున్నారు.

కరోనా విత్​డ్రాలు తక్కువే..

కరోనా నేపథ్యంలో తీసుకొచ్చిన కొవిడ్ విండో ద్వారా 30 లక్షల మంది ఈపీఎఫ్​ చందాదారులు రూ.8,000 కోట్లు విత్​డ్రా చేసుకున్నారు. అంతకంటే ఎక్కువగా మెడికల్ అడ్వాన్స్​ కింద 50 లక్షల మంది ఈపీఎఫ్​ చందాదారులు రూ.22,000 కోట్లు తమ భవిష్యనిధి నుంచి విత్​డ్రా చేసుకున్నట్లు ఈపీఎఫ్​ఓ తెలిపింది.

కరోనా నేపథ్యంలో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ఈపీఎఫ్​ నుంచి నగదు తీసుకునేందుకు ఏప్రిల్​లో ప్రత్యేక విండోను ఏర్పాటు చేశారు.

ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా చూస్తే.. మరికొన్ని రోజుల్లో ఈపీఎఫ్ విత్​డ్రా చేసుకునే ఉద్యోగుల సంఖ్య కోటికి చేరొచ్చని తెలుస్తోంది.

ఈ స్థాయి విత్​డ్రాలు ఎందుకు?

కరోనా కారణంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఏకంగా ఉద్యోగాలు తొలగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆదాయాలు తగ్గిపోవడం వల్ల.. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు ఈపీఎఫ్ నుంచి సొమ్ము వెనక్కి తీసుకుంటున్నారు.

ఇదీ చూడండి:గూగుల్​ ఉద్యోగులకు 2021 జూన్ వరకు వర్క్​ ఫ్రం హోమ్​

ABOUT THE AUTHOR

...view details