తెలంగాణ

telangana

By

Published : Feb 17, 2021, 5:21 AM IST

ETV Bharat / business

మార్చి 4 పీఎఫ్​పై వడ్డీ రేటు ప్రకటన!

2020-21 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్​పై వడ్డీ రేటును మార్చి 4న ఈపీఎఫ్​ఓ ప్రకటించనున్నట్లు సమాచారం. అదే రోజున శ్రీనగర్​లో జరిగే సంస్థ ధర్మకర్తల బోర్డు సమావేశంలో ఈ మేరకు ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది.

EPFO likely to declare rate of interest on EPF deposits on March 4
మార్చి 4 ఈపీఎఫ్​ఓ వడ్డీ రేటు ప్రకటన!

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్​ఓ) 2020-21 ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల్​లపై వడ్డీ రేటును మార్చి 4న ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర ధర్మకర్తల బోర్డు మార్చి 4న జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సమావేశం కానుంది. ఈ సమావేశంలో పీఎఫ్​పై వడ్డీ రేటును నిర్ణయించనున్నన్నట్లు సమాచారం.

2019-20 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్​పై వడ్డీ రేటు 8.5శాతం ఉండగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో దాన్ని తగ్గించనున్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో చాలా మంది తమ పీఎఫ్​ డిపాజిట్‌లను వెనక్కి తీసుకోవడం, తక్కువ మొత్తం జమకావడం వంటి కారణాలతో వడ్డీ రేటును తగ్గించే యోచనలో ఉంది ఈపీఎఫ్​ఓ.

2018-19 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్​పై వడ్డీ రేటు 8.65శాతం ఉండగా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బోర్డు దాన్ని 8.5శాతానికి తగ్గించింది.

ఇదీ చూడండి:పీఎఫ్​ క్లెయిమ్​ కోసం లంచం... సీబీఐకి చిక్కిన అవినీతి అధికారి

ABOUT THE AUTHOR

...view details