తెలంగాణ

telangana

ETV Bharat / business

'రైతులకూ సరళమైన వ్యాపారం, సులభతర జీవనం'

అన్నదాతకు అండగా నిలుస్తామని ఆర్థికమంత్రి హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెంచుతున్నట్టు ప్రకటించారు. అన్నదాతల ఆదాయం రెట్టింపు చేయడానికి కృషి చేస్తున్నట్టు వెల్లడించారు.

By

Published : Jul 5, 2019, 12:35 PM IST

'రైతులకూ సరళమైన వ్యాపారం, సులభతర జీవనం'

'రైతులకూ సరళమైన వ్యాపారం, సులభతర జీవనం'

పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించినందుకు అన్నదాతలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించారు. కొత్తగా 10 వేల ఉత్పత్తి సంస్థలను ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఆ సంస్థలు రానున్న ఐదేళ్లలో అన్నదాతలకు ఎంతో ఉపయోగపడతాయని నిర్మల ధీమా వ్యక్తం చేశారు.

'సరళమైర వ్యాపారం, సులభతర జీవనం' రైతులకూ వర్తించాలన్నారు. 'సున్నా బడ్జెట్'​ వ్యవసాయం కోసం మూలాల ఆధారంగా సరికొత్త పద్ధతులతో అన్నదాతల ఆదాయం రెట్టింపు చేయనున్నట్టు వెల్లడించారు.

ఇదీ చూడండి:- 'ఆర్థిక వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు అవసరం'

ABOUT THE AUTHOR

...view details