కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో.. దేశ జీడీపీలో భారత రుణ నిష్పత్తి 74 శాతం నుంచి 90 శాతానికి పెరిగిందని అంతర్జాతీయ ఆర్థిక నిధి (ఐఎంఎఫ్) వెల్లడించింది. 2019 చివరిలో స్థూల జాతీయోత్పత్తిలో రుణ నిష్పత్తి 74 శాతం ఉండగా.. 2020 చివరిలో ఇది 90 శాతానికి పెరిగిందని ఐఎంఎఫ్ ఆర్థిక వ్యవహారాల డిప్యూటీ డైరెక్టర్ పాలోమౌరో తెలిపారు. దేశ ఆర్థిక పునరుద్ధరణ ఫలితంగా.. ఇది 80 శాతానికి పడిపోతుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
భారత రుణ నిష్పత్తి శాతం ఎక్కువగా కనిపిస్తున్నా.. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు, ఆధునిక ఆర్థిక వ్యవస్థల్లో కూడా ఇది సంభవించిందని తెలిపారు పాలో. రాబోయే సంవత్సరాల్లో భారత ఆర్థిక వ్యవస్థలో లోటు కొంతవరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు.
మూడు రెట్లు ఎక్కువ నష్టం కలిగేది