తెలంగాణ

telangana

ఈ నెల 31 వరకు అంతర్జాతీయ విమానాలు రద్దు

By

Published : Oct 1, 2020, 5:01 AM IST

అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఉన్న నిషేధాన్ని మరోమారు పొడిగించింది డీజీసీఏ. ఈ నెల 31వరకు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులే ఇందుకు కారణమని పేర్కొంది.

DGCA extends suspension of scheduled int'l passenger flights till Oct 31
అక్టోబరు 31 వరకు అంతర్జాతీయ విమానాలు రద్దు

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న తరుణంలో అంతర్జాతీయ విమాన సేవలపై ఉన్న నిషేధాన్ని ఈ నెల 31 వరకు కొనసాగిస్తున్నట్లు డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. అయితే పరిమిత మార్గాల్లో మాత్రమే కొన్ని ప్రయాణికుల విమానాలు నడపనున్నట్లు తెలిపింది.

కరోనా కట్టడిలో భాగంగా మార్చి 23 నుంచి అన్ని అంతర్జాతీయ సర్వీసులను భారత్​ నిలిపివేసింది. అయితే మే నెల నుంచి "వందే భారత్​" మిషన్​లో భాగంగా ప్రత్యేక విమానాలను నడిపారు. ఆ తర్వాత ఆంక్షలను మూడు సార్లు(జులై 31, ఆగస్టు 31, సెప్టెంబరు 30 వరకు) పొడిగిస్తూ వచ్చింది డీజీసీఏ. తాజాగా ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

అయితే పలు దేశాలకు ప్రత్యేక విమానాలను నడిపేందుకు ఎయిర్‌ బబుల్‌ ఒప్పందం ద్వారా భారత్ విమాన సేవలను పునరుద్ధరించింది. ఇందులో భాగంగా జులై నుంచి అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, భూటాన్​, కెన్యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ)కు విమాన సేవలను ప్రారంభించింది.

ఇదీ చూడండి:'ఆరోగ్యంగానే ఉన్నా.. అందరికీ కృతజ్ఞతలు'

ABOUT THE AUTHOR

...view details