తెలంగాణ

telangana

ETV Bharat / business

అమెరికా దెబ్బకు చమురు ధరలకు రెక్కలు - 4 శాతానికిపైగా పెరిగిన ముడిచమురు ధరలు

ఇరాన్ నిఘా విభాగాధిపతి లక్ష్యంగా అమెరికా వైమానిక దాడులు చేసిన నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 4 శాతం మేర పెరిగిపోయాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు​ ధర రూ.4,514గా ఉంది. భారత్​ తన ఇంధన అవసరాల్లో 80 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఇరాన్.. భారత్​కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉన్న నేపథ్యంలో.. భవిష్యత్​లో మరింతగా పెరగనున్న చమురు ధరలు భారత్​కు భారం కానున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Crude oil futures rise 4 pc on rising US-Iran tensions
అమెరికా దెబ్బకు చమురు ధరలకు రెక్కలు

By

Published : Jan 3, 2020, 5:02 PM IST

ఇరాన్​ నిఘా విభాగాధిపతి లక్ష్యంగా అమెరికా వైమానిక దాడులు చేసిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 4 శాతం మేర పెరిగాయి. ఫలితంగా బ్యారెల్ ధర రూ.4,514లకు పెరిగింది.

ట్రంప్ ఆదేశాల మేరకు ఇరాక్​లో జరిగిన ఈ దాడుల్లో ఇరాన్​ అత్యున్నత సైనికాధికారి సహా పలువురు అధికారులు మరణించారు. ప్రపంచంలో అతి పెద్ద చమురు సరఫరాదారులైన ఈ రెండు దేశాలపై దాడి జరిగిన నేపథ్యంలో ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

అంతర్జాతీయ మార్కెట్​

శుక్రవారం నాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ ముడి చమురు ధర 2.96 శాతం పెరిగి బ్యారల్‌ 68.21 డాలర్లను చేరుకుంది. వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియెట్‌ (డబ్ల్యూటీఐ) ముడిచమురు ధర 2.81 శాతం పెరిగి 62.90 డాలర్లకు పెరిగింది.

భారత్​పై తీవ్ర ప్రభావం

భారత్​ తన ఇంధన అవసరాల్లో 80 శాతానికి పైగా అంతర్జాతీయ దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ముఖ్యంగా ఇరాన్​.. భారత్​కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉంది. ఇప్పుడు ఆ దేశంపై అమెరిగా దాడులు చేయడం వల్ల... భారత్​లో చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇదీ చూడండి: అమెరికా వైమానిక దాడితో స్టాక్​మార్కెట్లకు నష్టాలు

ABOUT THE AUTHOR

...view details