గుజరాత్, అసోం, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు నేరుగా కరోనా టీకా కొవాగ్జిన్ డోసులను సరఫరా చేసినట్లు భారత్ బయోటెక్ శుక్రవారం ప్రకటించింది. పవిత్ర రంజాన్ మాసంలోనూ ఇందుకోసం కృషి చేసిన తమ ఉద్యోగులందరికీ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు, ఎండీ సుచిత్ర ఎల్లా.
దిల్లీ ప్రభుత్వంతో సరఫరా సంబంధిత సమస్యల నేపథ్యంలో కొవాగ్జిన్ లాట్లను కేరళ, ఉత్తరాఖండ్కు పంపినట్లు కూడా పేర్కొన్నారు సుచిత్రా ఎల్లా. అయితే ఏ రాష్ట్రానికి ఎన్ని డోసులు సరఫరా చేసిన విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.