తెలంగాణ

telangana

By

Published : Jan 8, 2021, 3:40 PM IST

Updated : Jan 8, 2021, 6:02 PM IST

ETV Bharat / business

మార్కెట్లకు భారీ లాభాలు- సెన్సెక్స్​ @48,783

స్టాక్​మార్కెట్లు ఇవాళ రికార్డు స్థాయి లాభాలను నమోదుచేశాయి. సెన్సెక్స్​, నిఫ్టీ సూచీలు జీవితకాల గరిష్ఠాలకు చేరాయి. సెన్సెక్స్​ 689, నిఫ్టీ 210 పాయింట్ల మేర పెరిగాయి.

stocks close
మార్కెట్లకు భారీ లాభాలు- సెన్సెక్స్​ @48,783

అంతర్జాతీయంగా సానుకూలతలతో స్టాక్​ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఆటో రంగాల దూకుడుతో సూచీలు జీవిత కాల గరిష్ఠాలను తాకాయి. లోహ, బ్యాంకింగ్​ రంగం షేర్లు నష్టపోయాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ ఇవాళ్టి ట్రేడింగ్​లో​ 48 వేల 854 వద్ద జీవిత కాల గరిష్ఠాన్ని తాకింది. ఒక దశలో 760 పాయింట్లకుపైగా పెరిగింది. చివరకు 689 పాయింట్ల లాభంతో 48 వేల 783 వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 210 పాయింట్లు పెరిగి 14 వేల 347 వద్ద సెషన్​ను ముగించింది.

లాభనష్టాల్లోనివివే..

ఐటీ షేర్లు భారీగా పెరిగాయి. ముఖ్యంగా టెక్​ మహీంద్రా 5 శాతానికిపైగా లాభపడింది. మారుతీ సుజుకీ, విప్రో, యూపీఎల్​ష ఐచర్​ మోటార్స్​ రాణించాయి. మొత్తంగా దాదాపు 500 షేర్లు నేటి ట్రేడింగ్​లో అప్పర్​ సర్క్యూట్​ను తాకడం గమనార్హం.

హిందాల్కో, టాటా స్టీల్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, భారతీ ఎయిర్​టెల్​ డీలాపడ్డాయి.

Last Updated : Jan 8, 2021, 6:02 PM IST

ABOUT THE AUTHOR

...view details