తెలంగాణ

telangana

By

Published : May 24, 2021, 5:13 AM IST

ETV Bharat / business

ఆడిటర్ల నియామకంపై ఆర్‌బీఐకు సీఐఐ వినతి

బ్యాంకులకు, నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలకు ఆడిటర్ల నియామకంపై భారతీయ రిజర్వ్​ బ్యాంక్​ (ఆర్‌బీఐ) ఇచ్చిన ఆదేశాలను పునఃసమీక్షించాలని కాన్ఫడరేషన్ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) కోరింది. ఈ నిర్ణయం కొవిడ్‌ సమయంలో ఎన్‌బీఎఫ్‌సీలకు ఇబ్బందికరంగా మారుతుందని పేర్కొంది.

CII wants RBI to review
ఆడిటర్ల నియామకంపై ఆర్‌బీఐకు సీఐఐ వినతి

బ్యాంకులకు, నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలకు ఆడిటర్ల నియామకంపై ఆర్‌బీఐ ఇచ్చిన ఆదేశాలను పునఃసమీక్షించాలని సీఐఐ (కాన్ఫడరేషన్ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ) కోరింది. ఆ సర్క్యులర్‌ కారణంగా కొవిడ్‌ సమయంలో ఎన్‌బీఎఫ్‌సీలకు ఇబ్బందికరంగా మారుతుందని పేర్కొంది. ఆర్‌బీఐ గతనెల 27వ తేదీన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఆడిటర్ల నియామకంపై కొన్ని నిబంధనలు విధించింది. దీంతోపాటు ఆడిటర్ల రీ అపాయింట్‌మెంట్‌కు కొంతకాల వ్యవధిని ఏర్పాటు చేసింది. దీనిపై సీఐఐ స్పందించింది.

'ఈ నిబంధనల కారణంగా కంపెనీలకు ఇబ్బందులు పెరుగుతాయి. ఆ ప్రభావం పరిశ్రమపై పడుతుంది. ఆడిట్స్‌ సంఖ్యపై నిబంధనలు, జాయింట్‌ ఆడిట్లు, రొటేషన్‌ నిబంధనలు వంటివి వాణిజ్య బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు వర్తింపచేసి ఉండకూడదు. ఎటువంటి నిబంధనలు మార్చకుండా కూడా ఆర్‌బీఐ తన లక్ష్యాలను చేరుకోవచ్చు' అని సీఐఐ పేర్కొంది. అంతేకాదు ఈ మార్పులు అస్థిరమైన పాలసీలకు పునాదులు వేస్తాయని విమర్శించింది.

ఆర్‌బీఐ ఏప్రిల్‌ 27వ తేదీన ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. డిపాజిట్లు స్వీకరించని, రూ.1000 కోట్లలోపు ఆస్తులు ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలను దీని నుంచి మినహాయించింది. మిగిలిన ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకులు మూడేళ్ల ఆడిట్‌ను పూర్తి చేస్తే కనుక వెంటనే ఆడిటర్లను మార్చేయాలని పేర్కొంది. ఇక రూ.15వేల కోట్లు పైబడిన ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకులు జాయింట్‌ ఆడిటర్లను నియమించాలని పేర్కొంది.

ఇదీ చూడండి:కెయిర్న్​ వివాదంలో తీర్పును సవాలు చేసిన భారత్

ABOUT THE AUTHOR

...view details