తెలంగాణ

telangana

ప్రభుత్వ సంస్థలో బీఎస్​ఎన్​ఎల్ వినియోగం తప్పనిసరి

By

Published : Oct 14, 2020, 7:18 PM IST

Updated : Oct 14, 2020, 8:17 PM IST

ఇకనుంచి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ మంత్రిత్వ శాఖలు 'బీఎస్​ఎన్​ఎల్-ఎం​టీఎన్​ఎల్' సేవలను తప్పనిసరిగా వినియోగించాలని కేంద్రం ఆదేశించింది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలను నష్టాల నుంచి గట్టించేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

BSNL_MTNL
'బీఎస్​ఎన్​ఎల్-ఎమ్​టీఎన్​ఎల్' వినియోగం తప్పనిసరి

ప్రభుత్వ రంగ సంస్థల్లో బీఎస్​ఎన్​ఎల్-ఎం​టీఎన్​ఎల్ సేవల వినియోగాన్ని తప్పనిసరి చేసింది కేంద్రం. వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇకనుంచి వీటి సేవలనే ఉపయోగించుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది ​టెలికాం శాఖ. ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఇందుకు సంబంధించిన లేఖలను అన్ని ప్రభుత్వ శాఖలు, కార్యదర్శులకు ఈనెల 12న పంపింది.


తీవ్ర నష్టాల్లో ఉన్న బీఎస్​ఎన్​ఎల్​, ఎమ్​టీఎన్​ఎల్​ను గట్టెక్కించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 2019-20లో బీఎస్​ఎన్​ఎల్​కు రూ.15,500 కోట్లు నష్టం వాటిల్లగా, మహంగర్​ టెలీఫోన్​ నిగమ్ లిమిటెడ్​(ఎంటీఎన్​ఎల్​)కు రూ.3,694 కోట్ల నష్టం వచ్చింది.

తీవ్ర నష్టంలో ఉన్నందువల్లేవినియోగదారుల తగ్గుదల

నెట్​వర్క్ 2008(నవంబర్​) 2020(జులై)
బీఎస్​ఎన్​ఎల్ 2.9 కోట్లు 80 లక్షలు
ఎంటీఎన్​ఎల్ 35.4 లక్షలు 30.7 లక్షలు

ఇదీ చదవండి:ఆద్యంతం ఒడుదొడుకులు.. చివరకు స్వల్ప లాభాలు

Last Updated : Oct 14, 2020, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details