తెలంగాణ

telangana

ETV Bharat / business

రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం విడుదల

రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని కేంద్రం విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు రూ.1940.95కోట్లు, ఆంధ్రప్రదేశ్​కు రూ.2,222.71 కోట్లు ఉన్నాయి.

By

Published : Feb 20, 2021, 1:54 PM IST

gst
రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం విడుదల

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం విడుదల చేసింది. 17వ వాయిదాలో రూ.5వేల కోట్లు విడుదల చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇందులో తెలంగాణకు రూ.1940.95 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,222.71 కోట్లు ఉన్నాయి. రాష్ట్రాలకు ఇప్పటి వరకు రూ.లక్ష కోట్ల పరిహారం ఇచ్చినట్టు కేంద్రం వెల్లడించింది. రాష్ట్రాలకు 91శాతం లోటును భర్తీ చేశామని కేంద్రం పేర్కొంది. ఇప్పటి వరకు రాష్ట్రాలకు రూ.91,460.34 కోట్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.8,539.66 కోట్లు విడుదల చేసింది.

ఇదీ చూడండి:బంగారంపై రుణమా?.. ఇవి గుర్తుంచుకోండి

ABOUT THE AUTHOR

...view details