తెలంగాణ

telangana

By

Published : Sep 18, 2019, 3:39 PM IST

Updated : Oct 1, 2019, 1:54 AM IST

ETV Bharat / business

ఈ-సిగరెట్లపై నిషేధానికి కేంద్ర కేబినెట్​ ఆమోదం

ఈ-సిగరెట్లపై నిషేధానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్​ భేటీ అనంతరం చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

నిర్మలా సీతారామన్​, కేంద్ర ఆర్థిక మంత్రి

ఎలక్ట్రానిక్​ సిగరెట్లపై పూర్తి స్థాయి నిషేధానికి కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది. యువత సంక్షేమం, ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. కేబినెట్​ భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ఈ విషయమై ప్రకటన చేశారు.

"ఈ-సిగరెట్లపై నిషేధానికి కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది. ఉత్పత్తి, తయారీ, ఎగుమతులు, దిగుమతులు, రవాణా, క్రయవిక్రయాలు, నిల్వ, ప్రచారం.. ఇలా అన్నింటిపైనా నిషేధం కొనసాగుతుంది. ఈ-సిగరెట్లు అలవాటు మంచిదని కొంతమంది భావిస్తున్నారు. దేశంలో సుమారు 400 బ్రాండ్లు ఉన్నాయి. 150 రకాల ఫ్లేవర్లలో దొరుకుతున్నాయి. కానీ ఏ ఒక్కటి భారత్​లో తయారైంది కాదు. "

-నిర్మలా సీతారామన్​, కేంద్ర ఆర్థిక మంత్రి

  • ఈ- సిగరెట్‌ తయారీ, విక్రయం, దిగుమతి, నిల్వ అన్నింటిపైనా దేశంలో నిషేధం.
  • ఈ- సిగరెట్‌ వల్ల యువతపై చెడు ప్రభావం పడుతోంది.
  • ఈ- సిగరెట్‌ వల్ల అమెరికాలో చాలా దుష్ప్రభావాలు వచ్చాయి.
  • అమెరికా అనుభవాలు దృష్టిలో పెట్టుకుని మన దేశంలో కూడా నిషేధిస్తున్నాం.
  • అదే సమయంలో సాధారణ సిగరెట్‌ను కూడా ప్రోత్సహించడం లేదు.
  • పొగాకు వాడకాన్ని తగ్గించాలనేదే ప్రభుత్వ ఆశయం.
  • ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న ఈ- సిగరెట్ల తయారీ భారత్‌లో జరిగింది కాదు .
  • మన దేశంలో అక్రమంగా తయారైన వందకు పైగా రకాలు ఈ- సిగరెట్ల విక్రయం జరుగుతోంది.
  • ఈ- సిగరెట్‌ ప్రచారంపై కూడా నిషేధం విధిస్తున్నాం.

ఇదీ చూడండి: మందగమనంపై ప్రియాంక 'హౌదీ-మోదీ' పంచ్

Last Updated : Oct 1, 2019, 1:54 AM IST

ABOUT THE AUTHOR

...view details