తెలంగాణ

telangana

ETV Bharat / business

నేడు ఆర్థిక వేత్తలతో ప్రధాని మోదీ భేటీ - pm modi meets economists to seek suggestions on upcoming budget

ఆర్థిక వేత్తలు, వివిధ రంగాల నిపుణులతో ప్రధాని మోదీ నేడు సమావేశం కానున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.7శాతం క్షీణిస్తుందని భారతీయ రిజర్వు బ్యాంకు అంచనా వేసిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

Budget: PM Modi to interact with leading economists on Friday
ఆర్థిక వేత్తలతో నేడు ప్రధాని మోదీ భేటీ

By

Published : Jan 8, 2021, 5:06 AM IST

ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్‌పై సూచనలు, సలహాలు స్వీకరించడం సహా ఆర్థిక వృద్ధిని పెంచే చర్యలపై ఆర్థిక వేత్తలు, వివిధ రంగాల నిపుణులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు సమావేశం కానున్నారు. వర్చువల్‌ మార్గంలో జరిగే ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌, సీఈఓ అమితాబ్‌ కాంత్‌ దాస్‌ కూడా పాల్గొంటారు.

"ఆర్థిక వేత్తలతో ప్రధాని నేడు సమావేశం కానున్నారు. వచ్చే నెల ప్రవేశ పెట్టబోయే బడ్జెట్​ పై సలహాలు, సూచనలు తీసుకోనున్నారు"

-ఓ ప్రభుత్వ అధికారి

కరోనా వల్ల తయారీ, సేవా రంగాలు దెబ్బతిన్న నేపథ్యంలో, 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.7శాతం క్షీణిస్తుందని భారతీయ రిజర్వు బ్యాంకు తోపాటు వివిధ సంస్ధలు అంచనా వేశాయి. ఈ క్రమంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

ఇదీ చూడండి:ఎల్​ఐసీ పాలసీ పునరుద్ధరణకు మరో ఛాన్స్

ABOUT THE AUTHOR

...view details