తెలంగాణ

telangana

కరోనా భయంతో కళ తప్పిన ఆటోఎక్స్​పో

By

Published : Feb 8, 2020, 3:13 PM IST

Updated : Feb 29, 2020, 3:31 PM IST

కరోనా వైరస్ ప్రభావం ఆటో ఎక్స్​పో 2020లో ప్రత్యక్షంగా కనబడింది. చాలామంది వాహన ప్రేమికులు ముసుగులు ధరించి రావడం కనిపించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చైనాలోని అనేక వాహన తయారీ యూనిట్లు పనిని నిలిపివేశాయి. దీని వల్ల వాహనరంగంలో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని సీనియర్ జర్నలిస్ట్ సంజీబ్​ కేఆర్​ బారువా అంటున్నారు.

Mask rules at Delhi's 2020 Auto Expo as coronavirus dims mood
కరోనా భయంతో.. కళ తప్పిన ఆటోఎక్స్​పో

గ్రేటర్​ నోయిడాలో జరుగుతున్న ఆసియాలో అతిపెద్ద ఆటో కార్నివాల్​పై కరోనా ప్రభావం పడింది. వైరస్ వ్యాపిస్తుందనే భయంతో వాహన ప్రేమికులు మాస్కులు ధరించి రావడం స్పష్టంగా కనిపించింది.

ఆటో ఎక్స్​పో 2020 ప్రధాన మోటార్​ షో (15వ ఎడిషన్​) ... దేశ రాజధానికి 30 కి.మీ దూరంలో జరుగుతుండగా, దిల్లీ ప్రగతి మైదానంలో కాంపోనెంట్స్ షో నిర్వహిస్తున్నారు. అయితే కరోనా భయంతో ఈసారి సందర్శకుల సందడి బాగా తగ్గింది. వచ్చిన వారిలో కూడా చాలా మంది ముసుగులు ధరించారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్​ల పరిస్థితీ అంతే.

సాధారణంగా ఆటో ఎక్స్​పోలకు చైనీయులు ఎప్పుడూ భారీ సంఖ్యలో హాజరవుతుంటారు. అయితే ఈసారి వీసా రద్దు కారణంగా వారి సంఖ్య కూడా తగ్గింది.

తగ్గిన చైనా భాగస్వామ్యం

ఆటోఎక్స్​పోలో ఈసారి ముఖ్యంగా చైనా సంస్థల ప్రాతినిధ్యం, ఆసక్తి బాగా తగ్గింది. మందగమనానికి తోడు కరోనా సృష్టించిన భయమే ఇందుకు కారణం. కరోనా వల్ల ఇప్పటికే చైనాలోని పలు వాహన తయారీ యూనిట్లలో పని నిలిచిపోయింది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే వాహన పరిశ్రమపై ఆ దుష్ప్రభావం మరింత దారుణంగా ఉంటుంది.

ప్రపంచ వాహనరంగంలో చైనాది ఒక ప్రధాన పాత్ర. వాహనాలు మాత్రమేకాక, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో వాహన విడిభాగాలను కూడా చైనాలో తయారుచేస్తారు. ఎస్​ఏఐసీ మోటార్స్, బీవైడీ, గ్రేట్​వాల్​ మోటార్స్, లాంటి అనేక అగ్రస్థాయి వాహన పరిశ్రమలు చైనాలో ఉన్నాయి. వాస్తవానికి చైనాను ప్రభావితం చేసేది ఏదైనా.. అది మొత్తం ప్రపంచ వాహన రంగాన్ని ప్రభావితం చేస్తుంది.

ఇది మంచిది కాదు.

మునుపడి ఎక్స్​పోలతో పోల్చితే ఈసారి 'కాంపోనెంట్స్ షో'లో చాలా తక్కువ పరికరాలు ప్రదర్శనకు వచ్చాయి. ఇది ఏమాత్రం మంచి సంకేతం కాదు. ఎందుకంటే ఇక్కడ బిజినెస్ టు బిజినెస్ (బి2బి) ఇంటర్ఫేస్ జరుగుతుంది. అంటే వాహన తయారీదారులు తమ ఉత్పత్తులకు కావాల్సిన విడిభాగాలు ఇక్కడే దొరుకుతాయని ఆశిస్తారు.

ఎలక్ట్రిక్ వాహనాలు.. సవాళ్లు

ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలపై అందరికీ ఆసక్తి పెరిగింది. అయితే ఇందుకోసం స్పష్టమైన విధివిధానాలు రూపొందించాలి. అలాగే అవసరాలకు సరిపడా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుచేయడం లాంటి లాజిస్టిక్స్​తో సహా చాలా సవాళ్లును అధిగమించాలి.

ఇవి పాల్గొనలేదు..

బాడ్ సెంటిమెంట్​ను బలపరుస్తూ.... ఈసారి జరిగిన ఎక్స్​పోలో దిగ్గజ సంస్థలైన బీఎమ్​డబ్ల్యూ, ఆడి, జాగ్వార్ ల్యాండ్​రోవర్​ సహా యమహా, హోండా, హార్లే డేవిడ్​సన్, ట్రయంఫ్ లాంటి ద్విచక్రవాహన బ్రాండ్లు కూడా పాల్గొనలేదు.

ఇదీ చూడండి: ఐఫోన్లకు బ్రేక్- మాస్కుల తయారీలో ఫాక్స్​కాన్​ బిజీ

Last Updated : Feb 29, 2020, 3:31 PM IST

ABOUT THE AUTHOR

...view details