ప్రస్తుతం కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో వస్త్ర రంగంలో వినూత్న ఆవిష్కరణకు సన్నాహాలు చేస్తోంది ప్రముఖ టెక్స్టైల్ సంస్థ అరవింద్ లిమిటెడ్. కరోనా వైరస్ను అంతమొందించే యాంటీ వైరల్ దుస్తులను తయారు చేయనున్నట్లు ప్రకటించింది. త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.
ఇంటెలిఫాబ్రిక్స్ పేరుతో తయారు చేస్తున్న ఈ దుస్తుల కోసం స్విస్ టెక్స్టైల్ దిగ్గజం హైక్యూతో జతకట్టనుంది అరవింద్. తైవాన్కు చెందిన జిన్టెక్స్ కార్పొరేషన్ సహకారం కూడా తీసుకోనుంది.
దుస్తులపై వైరస్, బాక్టీరియా రెండు రోజుల పాటు మనుగడ సాగిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.హైక్యూ వైరోబ్లాక్ సాంకేతికతతో వైరస్ను అంతమొందించచ్చని అరవింద్ లిమిటెడ్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ కులిన్ లాల్భాయ్ తెలిపారు. ఫలితంగా వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చన్నారు.