ఆధార్ వివరాలను అప్డేట్ చేసేందుకు దేశవ్యాప్తంగా దాదాపు 20వేల కామన్ సర్వీస్ సెంటర్ల(సీఎస్సీ)లకు అనుమతులిచ్చింది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ-ఉడాయ్. ఈ సీఎస్సీలు బ్యాంకింగ్ కరెస్పాండెంట్లుగా పని చేస్తాయని స్పష్టం చేసింది.
అయితే ఇవి షరుతులతో కూడిన అనుమతులేనని స్పష్టం చేస్తూ ఈ నెల 24న.. సీఎస్సీ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ సీఈఓ దినేశ్ త్యాగికి లేఖ రాసింది ఉడాయ్. కేవలం జనాభాకు సంబంధించిన వివరాలకే అనుమతులున్నాయని స్పష్టం చేసింది. వేలిముద్రలు, ఐరిస్ అనే సాఫ్ట్వేర్ సహాయంతో ఆపరేటర్లు, నివాసితుల ప్రమాణీకరణ జరుగుతుందని తెలిపింది.
ఈ ఏడాది జూన్కల్లా ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. సంతానం, చిరునామాలోని మార్పులకు సంబంధించిన బయోమెట్రిక్ వివరాలను సీఎస్సీలు అప్డేట్ చేస్తాయి.