ఈ ఏడాది చివరి నాటికి దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావొచ్చని అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్పర్సన్ శోభనా కామినేని అభిప్రాయపడ్డారు. కొవిడ్- 19 వ్యాక్సిన్ పంపిణీకి అపోలో సన్నద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఈ మేరకు జూబ్లిహిల్స్లోని అపోలో ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా త్వరలో కొవిడ్- 19 వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, భారత్ వంటి అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో వ్యాక్సిన్ సరఫరా అనేది కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.