తెలంగాణ

telangana

ETV Bharat / business

రూపాయికే 4 ఇడ్లీల కమలాత్తాళ్​కు మహీంద్రా భరోసా

పేద కూలీలకు రూపాయికే 4 ఇడ్లీలు అందిస్తోన్న తమిళనాడుకు చెందిన కమలాత్తాళ్​కు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్​ మహీంద్రా అండగా నిలిచారు. కమలాత్తాళ్​ ఇప్పటికీ కట్టెల పొయ్యి వినియోగిస్తున్నందున.. ఆమెకు భారత్​ గ్యాస్​ కోయంబత్తూరు వారు ఎల్​పీజీ గ్యాస్​ స్టవ్​ అందించారు. ఇకపై దానికి అయ్యే గ్యాస్​ ఖర్చులు మొత్తం భరించడానికి ఆనంద్ మహీంద్రా ముందుకు వచ్చి తన దాతృత్వం ప్రకటించుకున్నారు.

By

Published : Sep 12, 2019, 11:49 AM IST

Updated : Sep 30, 2019, 7:52 AM IST

రూపాయికే 4 ఇడ్లీల కమలాత్తాళ్​కు ఆనంద్​ మహీంద్రా భరోసా

రూపాయికే 4 ఇడ్లీల కమలాత్తాళ్​కు మహీంద్రా భరోసా

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే మహీంద్రా గ్రూప్ ఛైర్మన్​ ఆనంద్​ మహీంద్రా.. తమిళనాడుకు చెందిన కమలాత్తాళ్​కు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. పేద కూలీలకు కేవలం రూపాయికే 4 ఇడ్లీలు అందిస్తున్న ఆమె పనికి ముగ్ధులయ్యారు. ఆమె వ్యాపారానికి కావాల్సిన ఆర్థిక సహాయ సహకారాలు అందించేందుకు సన్నద్ధమయ్యారు.

కట్టెల పొయ్యి ఇంకానా?

ఎనభై ఏళ్ల వయస్సులోనూ కమలాత్తాళ్​... కట్టెల పొయ్యిపైనే ఇడ్లీలు, బోండాలు చేస్తోంది. ఇది ఆమె ఆరోగ్యానికి హాని చేస్తుందని ఆనంద్​ మహీంద్రా అభిప్రాయపడ్డారు. ఆమెకు తెలిసినవారు ఎవరైనా ఉంటే.. గ్యాస్ స్టవ్​ కొనిస్తానని ప్రకటించారు.

మంచి పనికి... స్పందన

మహీంద్రా ప్రకటన చూసి స్పందించిన 'భారత్​ గ్యాస్ కోయంబత్తూరు' వారు కమలాత్తాళ్​కు ఎల్​పీజీ గ్యాస్​ స్టవ్​ అందించారు.

"ఇది అద్భుతం. కమలాత్తాళ్​కు ఆరోగ్య బహుమతి(ఎల్​పీజీ గ్యాస్​ స్టవ్​) అందించిన భారత్​ గ్యాస్​ కోయంబత్తూర్​కి ధన్యవాదాలు. నేను ముందే చెప్పినట్లుగా.. ఇకపై నిరంతరం ఆమెకు అయ్యే ఎల్​పీజీ గ్యాస్​ ఖర్చులు నేను భరిస్తాను. ఇది నాకు ఎంతో సంతోషకరమైన విషయం. ధన్యవాదాలు!"

- ఆనంద్​ మహీంద్రా, మహీంద్రా గ్రూప్​ ఛైర్మన్

ఇదీ చూడండి: 'పద్మా'లకు పేర్లను నామినేట్ చేయండి: అమిత్ షా

Last Updated : Sep 30, 2019, 7:52 AM IST

ABOUT THE AUTHOR

...view details