ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు చెందిన చెల్లింపుల విభాగం అమెజాన్ పే(ఇండియా) గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో రూ.1,868.5 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. 2018-19లో సంస్థ నష్టం రూ.1,160.8 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.834.5 కోట్ల నుంచి 64 శాతానికి పైగా పెరిగి రూ.1,370 కోట్లకు చేరింది.
అమెజాన్ పే నష్టం రూ.1868 కోట్లు - అమెజాన్ పే ఇండియా గత ఆర్థిక ఏడాది నష్టాలు
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చెల్లింపుల విభాగం అమెజాన్ పే గతేడాది భారీ నష్టాన్ని చవిచూసినట్టు వెల్లడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.1,865 కోట్లు నికరంగా నష్టపోయినట్టు తెలిపింది.
![అమెజాన్ పే నష్టం రూ.1868 కోట్లు AMAZON PAY LOSS OF RS.1868 CRORES](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9850522-thumbnail-3x2-amazon.jpg)
అమెజాన్ పే నష్టం రూ.1868 కోట్లు
పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి సంస్థలతో పోటీపడుతున్న అమెజాన్ పేలోకి గత ఆర్థిక ఏడాది అమెజాన్ కార్పొరేట్ హోల్డింగ్స్, అమెజాన్ డాట్ కామ్ల నుంచి రూ.2,700 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఈ సంస్థలకు అమెజాన్ పే జూన్లో రూ.450 కోట్లు, అక్టోబరులో రూ.900 కోట్లు, 2019 డిసెంబరులో రూ.1355 కోట్ల మేర షేర్లను కేటాయించింది. ఈ ఏడాది సెప్టెంబర్లో మరో రూ.700 కోట్ల విలువైన షేర్లు జారీ చేసింది.
ఇదీ చదవండి:అమెజాన్లో.. అడవి ఆడబిడ్డల ఉత్పత్తులు