దేశంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ మరో భారీ సేల్తో వినియోగదారుల ముందుకు రానుంది. ఫ్లిప్కార్ట్ '“ది రిపబ్లిక్ డే సేల్'” పేరుతో అమ్మకాలు ప్రారంభించనుంది. ఈ సేల్ను జనవరి 19 నుంచి 22 వరకు నిర్వహించనుంది. ఈ సేల్లో భాగంగా స్మార్ట్ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాలు, ఫ్యాషన్ వస్తువులు, గ్రాసరీ, బ్యూటీ, స్పోర్ట్స్, బేబీ కేర్ ఉత్పత్తులపై భారీ మొత్తంలో డిస్కౌంట్లను అందించనుంది.
భారీ డిస్కౌంట్స్
ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు, కొటాక్ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా షాపింగ్ చేసే వారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్ను సంస్థ అందించనుంది. డెబిట్ కార్డు వినియోగదారులకు ఈఎంఐ సదుపాయాన్ని అందించనుంది. అలాగే బై బ్యాక్ గ్యారంటీ, కేవలం ఒక్క రూపాయి నుంచే కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ను కూడా ఫ్లిప్కార్ట్ అందించనుంది. వీటితో పాటు బజాజ్ ఫిన్సర్వ్ అందించే నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్, ఫ్లిప్ కార్ట్ పే లేటర్ లాంటి సేవలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. దీనితో పాటు బై బ్యాక్ గ్యారంటీ, రూ.99 ల నుంచే కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ను కూడా ఫ్లిప్కార్ట్ అందిస్తుంది. అలాగే మొబైల్స్పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.
రేపటి నుంచే..
ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యులకు జనవరి 18వ తేదీ రాత్రి 8 గంటల నుంచే ప్రారంభమవుతుంది. వీటితో పాటు సేల్ జరిగే సమయంలో బ్లాక్ బస్టర్ డీల్స్, రష్ అవర్స్, ప్రైస్ క్రాష్ వంటి ఆఫర్లను కూడా అందించనుంది. ఈ సేల్లో టీవీలు & అప్లయన్సెస్పై 75 శాతం వరకు, ఎలక్ట్రానిక్ పరికరాలపై 80 శాతం వరకు, ఫ్యాషన్పై 50 నుంచి 80 శాతం వరకు, హోమ్ & ఫర్నిచర్ పై 80 శాతం వరకు, ఫ్లిప్కార్ట్ బ్రాండ్స్ పై 80 శాతం వరకు, అంతర్జాతీయ విమాన టికెట్లపై రూ. 25000 వరకు, రిఫర్బిషడ్ ప్రొడక్ట్స్పై 85 శాతం వరకు డిస్కౌంట్ను పొందవచ్చు.
అమెజాన్ సేల్