ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వార్షిక 'ప్రైమ్ డే సేల్'లో భాగంగా సరికొత్త ఆఫర్లను ముందుకు తీసుకొస్తోంది. జులై 26 నుంచి రెండు రోజుల పాటు ఈ సేల్ జరగనుంది. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు సహా అనేక ఎలక్ట్రానిక్ వస్తువులపై డిస్కౌంట్లు ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో కలిసి 10 శాతం రాయితీ కల్పించనుంది. ఇక ఈసారి 'అడ్వాంటేజ్-జస్ట్ ఫర్ ప్రైమ్' పేరిట ప్రైమ్ ఖాతాదారులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది.
'అడ్వాంటేజ్-జస్ట్ ఫర్ ప్రైమ్ ప్రోగ్రాం' కింద హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డు కలిగిన వారు తక్కువ వడ్డీరేటు, ఎక్కువ ఈఎంఐలతో స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే ఆరు నెలల పాటు ఉచితంగా స్క్రీన్ రీప్లేస్మెంట్ కూడా అందిస్తోంది. సాధారణంగా స్క్రీన్ రీప్లేస్మెంట్కు ఫోన్ ధరలో 40 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుంది.