దేశీయ విమాన సర్వీసులపై కీలక వ్యాఖ్యలు చేశారు పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా. దేశంలో విమాన కార్యకలాపాలు 65శాతం సాధారణ స్థితికి చేరాయన్నారు. "ఏవియేషన్ అండ్ టూరిజం-ది రోడ్ ఎహెడ్" అంశంపై 'ఫెడరేషన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ' నిర్వహించిన వెబినార్లో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
శుక్రవారం ఒక్కరోజే దాదాపు 2 లక్షల 50వేల మంది దేశీయ విమానాల్లో ప్రయాణించారని తెలిపారు ప్రదీప్ సింగ్. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కరోనాకు ముందు 3 లక్షల 70 వేల నుంచి 3 లక్షల 75వేల మంది ప్రయాణించేవారని వివరించారు.