భారతదేశంలో అంతర్జాలం వాడకంలో చిన్నారులు దూసుకుపోతున్నారు. దేశంలో ఇంటర్నెట్ వాడుతున్న 45 కోట్ల 10 లక్షల మంది వినియోగదారుల్లో చిన్నారులే 15 శాతం ఉన్నారు. వీరంతా 5 నుంచి 11 ఏళ్లలోపు వారేనని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎమ్ఏఐ) తాజాగా విడుదల చేసిన 'ఇండియా ఇంటర్నెట్ 2019' నివేదిక స్పష్టం చేస్తోంది.
నెలవారీ క్రియాశీల అంతర్జాల వినియోగదారుల పరంగా చూస్తే చైనా తరువాత స్థానంలో భారత్ ఉందని ఈ నివేదిక చెబుతోంది.
"45 కోట్ల 10 లక్షల మంది నెలవారీ క్రియాశీల వినియోగదారుల్లో... 38కోట్ల 50 లక్షల మంది 12 ఏళ్లు కంటే ఎక్కువ వయస్సు గలవారు. 6కోట్ల 60 లక్షల మంది 5 నుంచి 11 ఏళ్లలోపు చిన్నారులు. వీరంతా వారివారి కుటుంబసభ్యులకు చెందిన డివైసెస్లో అంతర్జాలాన్ని వినియోగిస్తున్నారు. 2/3 వంతుల మంది ఇంటర్నెట్ వినియోగదారులు 12 నుంచి 29 ఏళ్ల లోపువారు."
-'ఇండియా ఇంటర్నెట్ 2019' నివేదిక
అంతర్జాలం మరింత విస్తరించాల్సి ఉంది..