తెలంగాణ

telangana

By

Published : Mar 3, 2020, 5:51 PM IST

ETV Bharat / business

ఏజీఆర్​, స్పెక్ట్రం బకాయిల చెల్లింపులు ముమ్మరం

టెలికాం కంపెనీలు వొడాఫోన్​ ఐడియా రూ.3,043 కోట్లు, భారతీ ఎయిర్​టెల్​ రూ.1,950 కోట్లు, రిలయన్స్ జియో రూ.1,053 కోట్లు... డిఫర్డ్ స్పెక్ట్రం బకాయిలను చెల్లించాయి. టాటా టెలిసర్వీసెస్​ లిమిటెడ్​ సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్​) కింద రూ.2000 కోట్లు జమ చేసింది.

Airtel, vodafone idea, jio pays crores of rupees to DoT towards deferred spectrum dues
ఏజీఆర్​, స్పెక్ట్రం బకాయిల చెల్లింపులు ముమ్మరం

టెలికాం కంపెనీలు తమ డిఫర్డ్​ స్పెక్ట్రం బకాయిలను మంగళవారం చెల్లించాయి. వొడాఫోన్‌ ఐడియా రూ.3,043 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్‌ రూ.1,950 కోట్లు, రిలయన్స్ జియో రూ.1,053 కోట్ల మేర చెల్లించాయి.

ఈ డిఫర్డ్ స్పెక్ట్రం బకాయిలు కోసం టెల్కోలు చేసే చివరి చెల్లింపులు ఇవే అవుతాయి. ఎందుకంటే కేంద్ర కేబినెట్​ గతేడాది చివర్లో ఇటువంటి స్పెక్ట్రం చెల్లింపు బకాయిలపై రెండేళ్ల తాత్కాలిక నిషేధాన్ని ఆమోదించింది.

సుప్రీం ఆగ్రహంతో..

టాటా టెలిసర్వీసెస్ లిమిటెడ్... టెలికాం విభాగానికి సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయి కింద మరో రూ.2,000 కోట్లు చెల్లించింది. ఇదే కంపెనీ ఫిబ్రవరి 17న కంపెనీ లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం వినియోగ ఛార్జీల కోసం రూ.2,197 కోట్లు జమ చేసింది.

వొడాఫోన్ ఐడియా రూ.53,000 కోట్ల బకాయిలు ఉండగా... ఇప్పటి వరకు రూ.3,500 కోట్లు చెల్లించింది. టాటా టెలికమ్యునికేషన్స్​ ఇంకా రూ.14,000 కోట్లు కట్టాల్సి ఉంది.

సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్​) చెల్లింపులో జాప్యంపై ఇటీవల సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో టెలికాం కంపెనీలు విడతల వారీగా వాటిని చెల్లించడం ప్రారంభించాయి.

వ్యత్యాసం ఇదే..

టెలికాం కంపెనీలు గత వేలంలో కొనుగోలు చేసిన ఎయిర్​వేవ్​లపై డిఫర్డ్ స్పెక్ట్రం బకాయిలు చెల్లించాల్సి ఉంది. కనుక ఈ డిఫర్డ్ స్పెక్ట్రం బకాయిలకు, సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్​) చెల్లింపులకు మధ్య వ్యత్యాసం ఉంది.

ఇదీ చూడండి:స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. నేటి లెక్కలివే....

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details