తెలంగాణ

telangana

'వీఆర్​ఎస్'కు​ ముగిసిన గడువు.. 92, 700 మంది దరఖాస్తు

By

Published : Dec 3, 2019, 9:33 PM IST

బీఎస్​ఎన్​ఎల్, ఎంటీఎన్​ఎల్​​ స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్​ఎస్​) పథకానికి మొత్తం 92 వేల 700 దరఖాస్తులు వచ్చాయి. వీఆర్​ఎస్​ దరఖాస్తుల స్వీకరణ గడువు ఇవాళ్టితో ముగిసింది. వ్యయాలు తగ్గించుకునేందుకు తీసుకువచ్చిన ఈ పథకం 2020 జనవరి 1 నుంచి అమలు కానుంది.

92700-bsnl-mtnl-employees-opt-for-voluntary-retirement
ముగిసిన 'వీఆర్​ఎస్'​ గడువు.. 92, 700 మంది దరఖాస్తు

ప్రభుత్వరంగ టెలికాం దిగ్గజం బీఎస్​ఎన్​ఎల్​ తమ ఉద్యోగులకు ప్రకటించిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికి(వీఆర్​ఎస్​)కు భారీ స్పందన వచ్చింది. దరఖాస్తుల గడువు ఇవాళ్టితో ముగియగా.. మొత్తం 92 వేల 700 మంది అర్జీ పెట్టుకున్నారు. ఇందులో 78 వేల 300 మంది బీఎస్​ఎన్​ఎల్​, 14 వేల 378 మంది ఎంటీఎన్​ఎల్​ ఉద్యోగులు ఈ పథకాన్ని ఎంచుకున్నారు.

వీఆర్​ఎస్​కు దరఖాస్తు చేసుకున్న వారు కాకుండా.. మరో 6 వేల మంది పదవీ విరమణ చేశారని బీఎస్​ఎన్​ఎల్​ ఛైర్మన్​ అండ్​ ఎండీ పీకే పుర్వార్​ తెలిపారు.బీఎస్​ఎన్​ఎల్​తో పాటే మరో ప్రభుత్వరంగ సంస్థ ఎంటీఎన్​ఎల్​కూ ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ఇది వరకే స్పష్టం చేసింది. స్వచ్ఛంద పదవీ విరమణ పథకం 2020 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.

వీఆర్ఎస్ ఎందుకంటే..?

భారీ అప్పుల్లో కూరుకుపోయిన బీఎస్​ఎన్​ఎల్​, ఎంటీఎన్​ఎల్​ సంస్థలను గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఇటీవల రూ.69,000 కోట్ల భారీ ప్యాకేజి ప్రకటించింది. వ్యయాలు తగ్గించుకునేందుకు ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని తీసుకువచ్చింది. 70,000- 80,000 మంది ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ ఇవ్వడం ద్వారా రూ.7,000 కోట్ల వేతన బిల్లును పొదుపు చేయాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ భావిస్తోంది.

వీఆర్​ఎస్​ ఎక్స్​గ్రేషియా లెక్క..

వీఆర్ఎస్​కు అర్హత కలిగిన ఉద్యోగులు.. వారు పని చేసిన ప్రతి ఏడాదికి 35 రోజుల చొప్పున, మిగిలిన ఉద్యోగ సంవత్సరాలకు 25 రోజుల చొప్పున ఎక్స్​గ్రేషియా పొందుతారు.

ABOUT THE AUTHOR

...view details