దేశాన్ని కుదిపేసిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దాదాపు 50 లక్షల మంది ఉపాధి కోల్పోయారని ఓ సర్వే వెల్లడించింది. స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా పేరుతో అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ఈ సర్వే చేసింది.
సీఎంఐసీ-సీపీడీఎక్స్ డాటా ఆధారంగా చేసిన ఈ సర్వేలో యువత ఎక్కువగా ఉపాధికి దూరమైనట్లు తేలింది. ఉపాధి కోల్పోయిన వారిలో అత్యధికం మహిళలేనని సర్వే పేర్కొంది.
రెండేళ్లలో రెట్టింపు
నిరుద్యోగం రేటు 2018 నాటికి 6 శాతానికి చేరింది. ఇది 2000 నుంచి 2011 మధ్య దశాబ్దకాలంలో ఉన్న నిరుద్యోగ రేటు కన్నా రెండింతలు ఎక్కువని సర్వే పేర్కొంది.