తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనాతో ఉపాధి కోల్పోయిన 41 లక్షల మంది యువత - ADB

కరోనా సంక్షోభంలో దేశంలోని 41లక్షల మంది యువత ఉద్యోగాలు కోల్పోయినట్టు ఐఎల్​ఓ-ఏడీబీ నివేదిక పేర్కొంది. నిర్మాణ, వ్యవసాయ రంగంలోని వారే ఎక్కువగా ఉద్యోగాలు కోల్పోయినట్టు వెల్లడించింది.

41 lakh youth lose jobs in India due to COVID-19 impact: ILO-ADB Report
కరోనాతో ఉద్యోగం కోల్పోయిన 41లక్షలమంది యువత

By

Published : Aug 19, 2020, 5:02 AM IST

కరోనా మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా 41 లక్షల మంది యువత ఉద్యోగాలు కోల్పోయినట్టు ఓ నివేదిక తెలిపింది. నిర్మాణం, వ్యవసాయ రంగంలోనే అత్యధికంగా ఉద్యోగాలు పోగొట్టుకున్నట్టు పేర్కొంది.

"టాక్లింగ్​ ది కొవిడ్​-19 యూత్​ ఎంప్లాయిమెంట్​ క్రైసిస్​ ఇన్​ ఏషియా అండ్​ ది పసిఫిక్​" అనే పేరుతో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్​ఓ), ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించింది.

పెద్దల (25ఏళ్లు పైబడిన) కన్నా యువత (15-24ఏళ్ల)పైనే సంక్షోభ ప్రభావం అధికంగా పడిందని.. ఇది దీర్ఘకాలికంగా వారి ఆర్థిక, సామాజిక జీవితాలపై ప్రభావం చూపుతుందని నివేదిక పేర్కొంది.

'గ్లోబల్​ సర్వే ఆన్​ యూత్​ అండ్​ కొవిడ్​-19' నివేదికను.. వివిధ దేశాల్లో నిరుద్యోగ డేటా అంచనాల ఆధారంగా రూపొందించారు.

యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా అత్యవసర, భారీస్థాయిలో చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలకు నివేదిక సూచించింది.

నిజానికి కరోనాకు ముందు నుంచే పరిస్థితులు దారుణంగా మారాయి. నిరుద్యోగ రేటు భారీ స్థాయిలో ఉండటంతో పాటు పాఠశాలలకు, ఉద్యోగాలకు వెళ్లని యువత సంఖ్య ఎక్కువగా ఉండేది. కరోనాతో పరిస్థితి మరింత విషమించింది.

ఇదీ చూడండి:-పల్లెపట్టులకేదీ ఉపాధి భరోసా?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details