ఆన్లైన్ షాపింగ్లో కొనే వస్తువులపై అది ఏ దేశానికి చెందినదో తెలుసుకునేలా.. నిబంధనను విధించాలని కేంద్రం భావిస్తోంది. ఈ తరుణంలో ఇదే అంశం గురించి ఆన్లైన్ షాపింగ్ చేసేవారిపై 'లోకల్ సర్కిల్స్' అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది.
సర్వేలో పాల్గొన్న వారిలో 37 శాతం మంది కొనే వస్తువు ఏ దేశానికి చెందినదో తెలుసుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడైంది.
చైనాతో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో విక్రయించే వస్తువులపై వాటి మూలాలు (కంట్రీ ఆఫ్ ఆరిజిన్) తెలపాలనే డిమాండ్కు మద్దతు పెరిగింది. దీనిపై డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్స్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ).. ఈ కామర్స్ సంస్థలతో చర్చించింది. దీనిపై ఆయా సంస్థలు కూడా సుముఖత వ్యక్తం చేశాయి.
సర్వేలోని ముఖ్యాంశాలు..
- సర్వేలో పాల్గొన్న 83 శాతం మంది రేటింగ్, రివ్యూలు చూస్తున్నట్లు తెలిపారు.
- 82 శాతం మంది ఎంఆర్పీ, డిస్కౌంట్ల సమాచారం కోసం వెతుకుతున్నట్లు సర్వేలో తేలింది.
- తినే ఉత్పత్తులైతే ఎక్స్పైరీ తేదీలను చూసి కొంటున్నట్లు 62 శాతం మంది చెప్పారు.
- 17 శాతం మంది ఈ కామర్స్ సైట్లలో కొనే వస్తువులకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లో (టెక్ట్స్ రూపంలో) ఉండాలని కోరారు.
- 46 శాతం మంది వరకు ఆయా ఉత్పత్తులకు సంబంధించిన అసలైన ప్యాకింగ్ ఫోటో సహా, ఎంఆర్పీ ట్యాగ్లను స్పష్టంగా కనిపించేలా ఉంచాలని కోరుతున్నట్లు సర్వే పేర్కొంది.
- 37 శాతం మంది ప్రస్తుతం ఇస్తున్న సమాచారం తమకు సరిపోతుందని చెప్పుకొచ్చారు.
ఇదీ చూడండి:దుకాణదారులు లేని షాపులు.. ఆచరణ సాధ్యమేనా?