తెలంగాణ

telangana

ETV Bharat / budget-2019

బడ్జెట్​ 2019 : '2024కల్లా ఇంటింటికి తాగునీటి కుళాయి'

2024 నాటికి దేశంలోని ప్రతి ఇంటికి తాగునీరందిస్తామన్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​. మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి సాగు యోగ్యంగా మలిచేందుకు ప్రత్యేక పథకాన్ని తేనున్నట్లు ప్రకటించారు.

By

Published : Jul 5, 2019, 12:39 PM IST

బడ్జెట్​ 2019 : '2024కల్లా ఇంటింటికి తాగునీటి కుళాయి'

నిర్మలా సీతారామన్​ బడ్జెట్​ ప్రసంగం

దేశంలోని రైతులందరికీ సాగు నీటితో పాటు ప్రతి పౌరుడికి తాగునీరును అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు నిర్మలా సీతారామన్​. జల జీవన్‌ మిషన్‌ ద్వారా 2024 నాటికి దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి తాగునీరందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి లోక్​సభకు నివేదించారు. వాననీటి సంరక్షణతో పాటు, ఇళ్ల నుంచి వచ్చే మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి సాగు యోగ్యంగా మలిచేందుకు ప్రత్యేక పథకాన్ని తేనున్నట్లు సీతారామన్​ ప్రకటించారు.

జలవనరుల సాధికారత కోసం జల్‌శక్తి విభాగం ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. జల్‌శక్తి మంత్రాలయ్‌ ద్వారా జలవనరుల్లోని అన్ని విభాగాలను ఏకీకృతం చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details